telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

టీడీపీ కాపులనువాడుకుని వదిలేసింది: మంత్రి బొత్స

గత ఎన్నికల ముందు టీడీపీ కాపులను వాడుకుని అధికారంలోకి వచ్చాక వదిలేసిందని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ ఆరోపించారు. కార్పొరేషన్‌ చైర్మన్‌గా జక్కంపూడి రాజా బాధ్యతల స్వీకార కార్యక్రమానికి బొత్స హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కాపులను ఓటు బ్యాంకుగా పరిగణించే తెలుగుదేశం పార్టీ 2014 ఎన్నికల్లో ఆ విధంగానే పరిగణించిందని దుయ్యబట్టారు. ఎన్నికల ముందు ఎన్నో హామీలిచ్చి తీరా అధికారంలోకి వచ్చాక కాపులను పట్టించకోవడం మానేసిందన్నారు.

కాపులకు రిజర్వేషన్ల సాధ్యాసాధ్యాలపై కేంద్రం స్పష్టమైన వైఖరిని ప్రకటించినా ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల వరకు మోసం చేస్తూనే వచ్చిందన్నారు. కాపు సంక్షేమానికి గత ప్రభుత్వం తూట్లు పొడిస్తే వారి సంక్షేమాన్ని కాంక్షిస్తూ వారికి అండగా నిలుస్తున్న వ్యక్తి ముఖ్యమంత్రి జగన్‌ అన్నారు. అందువల్ల కాపులం అంతా ఆయన వెన్నంటి ఉండాలని పిలుపునిచ్చారు.

Related posts