telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

గత పాలనలో అంతా అవినీతే.. అసెంబ్లీలో మంత్రి బొత్స

టీడీపీ ప్రభుత్వం హయాంలో పేదల ఇళ్ల నిర్మాణంలో అవినీతి జరిగిందని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఆరో రోజు అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా.. ఇళ్ల నిర్మాణాలపై చర్చ జరుగుతోంది. ఈ సందర్భంగా టీడీపీ సభ్యులు సంధించిన ప్రశ్నలకు మంత్రి బొత్స సమాధానమిచ్చారు. లబ్ధిదారులను తొలగించామంటూ దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఒక్క ఇల్లు కూడా పూర్తి చేసి ఇవ్వలేదనిచెప్పుకొచ్చారు.

పేదల ఇళ్ల నిర్మాణంలో అవినీతి జరిగింది. అందుకే రివర్స్ టెండరింగ్ వెళ్తామని ముందే చెప్పాం. రివర్స్ టెండరింగ్‌లో రూ. 150 కోట్లు మిగిలింది. పేదలు జీవితాంతం కట్టాల్సిన పరిస్థితి వచ్చింది. గత పాలన పేదల నిర్మాణంలో అంతా అవినీతే. రివర్స్ టెండరింగ్ వల్ల ఇంటికి రూ. 75వేలు ఆదా అయ్యింది. ఈ లెక్కన 3లక్షలు ఇళ్లకు రూ.2,626 కోట్లు దోపిడీ చేశారని బొత్స విమర్శలు గుప్పించారు.

Related posts