telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

అమ్మవారిని అవే కోరుకున్నా: మంత్రి బొత్స

నవరాత్రి ఉత్సవాల సందర్భంగా విజయవాడ ఇంద్రకీలాద్రికి ఈ రోజు ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ విచ్చేశారు. మహాలక్ష్మి అవతారంలో ఉన్న అమ్మవారిని సతీసమేతంగా దర్శించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం జగన్ చేయాలనుకుంటున్న మంచి పనులకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా కొనసాగాలని అమ్మవారిని కోరుకున్నానని చెప్పారు.

ఈ ఏడాది కొండపై భక్తుల సంఖ్య తక్కువగా ఉందనే వార్తలను బొత్స ఖండించారు. భక్తుల రద్దీ ఏమాత్రం తగ్గలేదని, భారీ సంఖ్యలో భక్తులు వస్తున్నారని ఆయన అన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పలు చర్యలను చేపట్టామని, దీంతో భక్తులంతా సులభంగా అమ్మవారిని దర్శనం చేసుకుని వెళ్తున్నారని చెప్పారు. గుడి వద్ద ఫ్లెక్సీలు ఎక్కువగా ఉన్నాయి, విషయం తక్కువగా ఉందంటూ టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వరరావు చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు.

Related posts