telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ప్రజావేదిక చంద్రబాబు సొంత ఇల్లు కాదు.. అది ప్రభుత్వ భవనం: బొత్స ఫైర్

ఉండవల్లి ప్రజావేదికను ప్రభుత్వం స్వాధీనం చేసుకొని, టీడీపీ అధినేత చంద్రబాబుకు సంబంధించిన సామాన్లను అధికారులు బయట పడేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీడీపీ నేతలు అక్కడకు చేరుకుని వాగ్వాదానికి దిగారు. ఈ నేపథ్యంలో ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ నేరుగా ప్రజావేదిక వద్దకు వచ్చేశారు. జిల్లా కలెక్టర్లతో ముఖ్యమంత్రి సదస్సుకు ఏర్పాట్లను పరిశీలించారు.

అనంతరం మీడియాతో మాట్లాడుతూ..ప్రజావేదిక మాది అని టీడీపీ నేతలు చెబుతున్నారు. మాది అని చెప్పడానికి ఇది చంద్రబాబు నాయుడు సొంత ఇల్లు కాదు కదా.. ఇది ప్రభుత్వ ధనంతో కట్టిన ప్రభుత్వ భవనం అని తెలిపారు. చంద్రబాబు నాయుడు ఇంటి పక్కన ప్రభుత్వ కార్యకలాపాలు ఏవీ జరగకూడదా? అని బొత్స ప్రశ్నించారు.ఇప్పుడు చంద్రబాబు ఉంటున్న ఇల్లే అక్రమ కట్టడమనీ, అక్కడ ఆయన ఉండకూడదని స్పష్టం చేశారు.

Related posts