telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

రాజధాని అమరావతిపై చర్చ జరుగుతోంది: మంత్రి బొత్స

minister bosta in vijayawada meeting

రాజధాని అమరావతిపై ఏపీ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం విశాఖపట్టణంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ అమరావతిపై ప్రభుత్వంలో చర్చ జరుగుతుందన్నారు. త్వరలోనే ఈ విషయమై ప్రకటన చేయనున్నట్టు బొత్స వివరించారు. అమరావతి ప్రాంతంలో నిర్మాణ వ్యయం భారీగా ఉందన్నారు. సాధారణ వ్యయం కంటే అమరావతిలో ఎక్కువ ఖర్చు అవుతోందని బొత్స సత్యనారాయణ చెప్పారు.

రాజధాని ప్రాంతంలో ఫైఓవర్లు, భారీ కట్టడాలు కట్టాల్సిన అవసరం ఉందన్నారు. దీంతో ప్రజా ధనం దుర్వినియోగం అయ్యే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.ఇటీవల సంభవించిన వరదలతో ఈ ప్రాంతం ముంపుకు కూడ గురయ్యే అవకాశం ఉందని తేలిందన్నారు. దీని నుండి కాపాడేందుకు కాలువలు, డ్యామ్ లను నిర్మించాల్సిన అవసరం ఉందని బొత్స సత్యనారాయణ చెప్పారు.వరద నీటిని బయటకు పంపేందుకు నీటిని తోడాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కారణాలపై ప్రభుత్వం అమరావతి విషయమై చర్చిస్తున్నట్టుగా బొత్స తెలిపారు.

Related posts