telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

రాజధాని రైతులకు జగన్ న్యాయం: మంత్రి అవంతి

avanthi srinivas minister ap

సీఎం వైఎస్ జగన్ ఎవరికీ అన్యాయం చేయరని ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. ఈ రోజు గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. రాజధాని రైతులకు జగన్ కచ్చితంగా న్యాయం చేస్తారన్నారు. విశాఖలో తక్కువ ఖర్చుతో రాజధాని కట్టొచ్చని చెప్పుకొచ్చారు.

మీడియా, డబ్బు అండతో ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి వెళ్లకుండా ప్రతిపక్షాలు అడ్డుపడుతున్నాయని మంత్రి అవంతి విమర్శలు గుప్పించారు. చంద్రబాబు రూ.రెండున్నర లక్షల కోట్లు అప్పుచేసి పోయారు. రాష్ట్ర ఇమేజ్ దెబ్బతీసే విధంగా విమర్శలు చేయడం చంద్రబా బుకు తగదు. రాష్ట్రం బిహార్ కంటే వరస్ట్‌గా ఉందనడం మంచి పద్ధతికాదన్నారు.

Related posts