telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

చంద్రబాబు ఇచ్చిన పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ తప్పుల తడక: మంత్రి అనిల్‌

Anil kumar jadav minister

చంద్రబాబు బుదర రాజకీయాలు చేస్తున్నారని ఏపీ జల వనరుల శాఖ మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌ మండిపడ్డారు. శనివారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ..వరదలపై చంద్రబాబు ఇచ్చిన పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ తప్పుల తడక అని ఆయన ధ్వజమెత్తారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పని చేసిన వ్యక్తికి నీటిని ఎలా వదులుతారో తెలియదని ఎద్దేవా చేశారు. ప్రతిపక్ష నేత చెబుతున్నట్లు వరద నీటిని వదిలేసి ఉంటే ఇవాళ డ్యాముల్లో నీరు ఉండేది కాదన్నారు. వరద నీటిని కిందకు వదిలి ఉంటే రాయలసీమకు నీరు ఎలా ఇస్తామని ధ్వజమెత్తారు.

టీడీపీ హయాంలో వరదల్లోనూ డబ్బులు కోసం కక్కుర్తి పడ్డారని విమర్శించారు. నది ఒడ్డున ఇల్లు కట్టుకుంటే… ఇల్లు మునగక ఏమి అవుతుందని మంత్రి సూటిగా ప్రశ్నించారు. నీళ్లు రాకముందే కింద అంతస్తులోని సామాను పైన పెట్టుకుని చంద్రబాబు హైదరాబాద్‌ వెళ్లిపోయారన్నారు. ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి రాష్ట్ర భద్రత గురించి ఆలోచించక, దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని మంత్రి విమర్శించారు.

Related posts