telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

కల్తీ ఆహార పదార్ధాల విక్రయాలను నిరోధించాలి: మంత్రి నాని

Alla-Nani minister

రాష్ట్రంలో కల్తీ ఆహార పదార్ధాలను విక్రయిస్తున్నట్టు సమాచారమందడంతో ఏపీ డిప్యూటీ సీఎం, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్లనాని మండిపడ్డారు. వారం రోజుల్లో కల్తీ ఆహార పదార్ధాల విక్రయాలను నిరోధించాలనిఅధికారులకు ఆదేశాలు జారీ చేశారు. శ్రీకాకుళం జిల్లాలో శెనగపిండికి బదులు కేసరి పప్పు పిండిని విక్రయిస్తున్నట్టు దృష్టికి రావడంతో మంత్రి సీరియస్‌ అయ్యారు

. శ్రీకాకుళం, టెక్కలి, పలాస, సోంపేట, ఇచ్ఛాపురం ప్రాంతాల్లో కేసరి పప్పు విక్రయిస్తుండగా, అది తింటే కంటి సంబంధిత వ్యాధులు వస్తాయని మంత్రి వెల్లడించారు. ఈ సందర్భంగా ఐపీఎం డైరెక్టర్‌, ఫుడ్‌ సేఫ్టీ అధికారులతో ఫోన్‌లో మాట్లాడిన మంత్రి వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

Related posts