telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ

ఎమ్మెల్యే, ఎంపీ అర్హత వయస్సు 20 ఏళ్లకు తగ్గించాలి: అసదుద్దీన్

MIM Comments MP Elections
రాజకీయాల్లో యువత ప్రాధాన్యం పెరగాలంటే ఎమ్మెల్యే, ఎంపీ అర్హత వయస్సు 20 ఏళ్లకు తగ్గించాలని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ అన్నారు.హైదరాబాద్ హెచ్‌ఐసీసీలో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో అంతర్జాతీయ యువజన నాయకత్వ సదస్సు జరుగుతోంది. నిజామాబాద్ ఎంపీ కవిత ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ సదస్సుకు 135 దేశాల నుంచి 550 మంది ప్రతినిధులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా అసదుద్దీన్ మాట్లాడుతూ..జాతీయ పార్టీల్లో చేరితే ఉన్నత స్థానాలకు ఎదగలేరని అసదుద్దీన్ పేర్కొన్నారు. రాజకీయాల్లో యువత ప్రాధాన్యం పెరగాలంటే ఎమ్మెల్యే, ఎంపీ అర్హత వయస్సు 20 ఏళ్లకు తగ్గించాలన్నారు. యువత అభివృద్ది చెందాలంటే పాలసీ మేకర్లలో యువప్రాతినిధ్యం పెరగాలని ఆయన ఆకాంక్షించారు. తన దృష్టిలో మహాత్మాగాంధీ కన్నా అంబేద్కర్ గొప్ప వ్యక్తని అభిప్రాయపడ్డారు.

Related posts