telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

కాంగ్రెస్ ఖాళీ.. బీజేపీకి స్థానం లేదు: ఒవైసీ

asaduddin owisi

తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికలపై మజ్లిస్ చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. ఓ ప్రముఖ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ ఖాళీ అయిందని, బీజేపీకి స్థానం లేదని అన్నారు. కాబట్టి మునిసిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్సే చాలా చోట్ల తమకు ప్రధాన ప్రత్యర్థి అని ఒవైసీ పేర్కొన్నారు.

మజ్లిస్ ఏ ఒక్క ప్రాంతానికో పరిమితమైన పార్టీ కాదని, అది జాతీయ పార్టీ అని పేర్కొన్నారు. తమ పార్టీ ఎమ్మెల్యేలు మహారాష్ట్రలో ఇద్దరు ఉన్నారని, అదే రాష్ట్రం నుంచి ఓ ఎంపీ కూడా ఉన్నారని గుర్తు చేశారు. బీహార్‌ అసెంబ్లీలోనూ తమ పార్టీకి ప్రాతినిధ్యం ఉందన్నారు. టీఆర్ఎస్ పాలనలో రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్యలు లేవని అన్నారు. టీఆర్ఎస్ తో స్నేహపూర్వకంగా ఉంటున్నా, మునిసిపల్ ఎన్నికల్లో ఆపార్టీతో కలిసి పనిచేయాల్సిన అవసరం లేదన్నారు.

Related posts