కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మొన్నటి లోక్ సభ ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేసిన సంగతి తెలిసిందే. ఆమెథీ నుంచి ఓడిపోగా కేరళ రాష్ట్రంలోని వయనాడ్లో గెలుపొందారు. రాహులు గెలుపు పై మజ్లిస్ పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ విశ్లేషించారు. మజ్లిస్ పార్టీ పూర్వ అధ్యక్షుడు సుల్తాన్ సలావుద్దీన్ ఒవైసీ వర్ధంతి సందర్భంగా యూకుత్పురాలో ఆదివారం రాత్రి జరిగిన సభలో అసద్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ముస్లిం మైనారిటీలు బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేశారని అన్నారు. అందుకే వయనాడ్లో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్గాంధీ విజయం సాధించారని తెలిపారు. దళితులు, ముస్లింలు, బీసీలు ఏకమైతే రాజ్యాధికారం సాధ్యమని ఒవైసీ అన్నారు. అందుకే ప్రస్తుత దేశ పరిస్థితుల దృష్ట్యా మైనారిటీలతో పాటు దళితులు, బడుగు బలహీన వర్గాలు ఒక్క తాటిపైకి రావాలని ఒవైసీ పిలుపునిచ్చారు.
ఎంపీ ధర్మపురి అరవింద్కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన జనసేన