ప్రధాని నరేంద్ర మోదీ పై ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ మండిపడ్డారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మహారాష్ట్రలోని ఔరంగాబాద్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఒవైసీ మాట్లాడుతూ మోదీమాటలకు, చేతలకు అంతులేనంత అంతరం ఉంటుందనివిమర్శించారు. ఓ వైపు ఉగ్రవాద నిరోధంపై అద్భుతమైన మాటలు వల్లె వేస్తారని, మరోవైపు ఉగ్రదాడుల్లో నిందితులకే పార్టీ తరపున టికెట్లు ఇచ్చి నిలబెడతారని ఆరోపించారు.
మాలేగావ్ పేలుళ్ల ద్వారా ఆరుగురు అమాయకుల ప్రాణాలను బలిగొన్న కేసులో నిందితురాలు సాద్వి ప్రగ్యాసింగ్ థాకూర్కు బీజేపీ టికెట్టు ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. ఇలాంటి చర్యలకు పాల్పడుతూ ఉగ్రవాదంపై పోరాడుతున్నట్టు చెప్పడం హాస్యాస్పదమన్నారు. మోదీ కల్లబొల్లి మాటలు దేశ ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. మరో నెలరోజుల్లో మోదీ మాజీ కావడం ఖాయమని అసదుద్దీన్ వ్యాఖ్యానించారు.