telugu navyamedia
రాజకీయ వార్తలు

జమ్మూకశ్మీర్ కు పట్టినగతే.. ఆ రాష్ట్రాలకు పడుతుంది: ఒవైసీ

Asaduddin mim

ఆర్టికల్ 370ని కేంద్ర ప్రభుత్వం ఇటీవల రద్దుచేసిన సంగతి తెలిసిందే. దీనిపై మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ మరోసారి స్పందించారు. ఢిల్లీలో ఆయన మీడియా తో మాట్లాడుతూ ఈరోజు జమ్మూకశ్మీర్ కు పట్టినగతే రేపు నాగాలాండ్, మిజోరం, మణిపూర్, అస్సాం, హిమాచల్ ప్రాంత ప్రజలకు పడుతుందని హెచ్చరించారు.తాను లోక్ సభ సభ్యుడిని అయినా నాగాలాండ్, లక్షద్వీప్ కు వెళ్లాల్సి వస్తే పర్మిట్ తీసుకోవాల్సి ఉంటుందని ఒవైసీ తెలిపారు. అస్సాం లాంటి షెడ్యూల్డ్ ప్రాంతంలో తాను భూమిని కూడా కొనలేనని అన్నారు.

ప్రస్తుతం భారత ప్రభుత్వం నాగాలాండ్ వేర్పాటువాదులతో చర్చ జరుపుతున్న విషయాన్ని ఒవైసీ గుర్తుచేశారు. కానీ నాగా వేర్పాటువాదులు ఇంకా ఆయుధాలు వదిలిపెట్టలేదని చెప్పారు. ఇప్పటికీ నాగాలాండ్ లో స్థానిక నేతలు చనిపోతే భారత జెండాతో పాటు నాగా జెండా కూడా ఎగురుతుందని తెలిపారు. జమ్మూకశ్మీర్ లో రెండు జెండాల గురించి మాట్లాడుతున్నవారికి నాగాలు రెండు జెండాలు ఎగరేయడం కనిపించలేదా? అని ప్రశ్నించారు.

Related posts