telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు సామాజిక

సాంకేతిక సమస్యతో నిలిచిన మెట్రో..ప్రయాణికుల ఇబ్బందులు

metro services till midnight today

హైదరాబాద్ నగరంలో బుధవారం మెట్రో రైల్ ట్రాక్‌పై నిలిచిపోయింది. దీంతో ఉదయంపూట విధులకు హాజరయ్యే ఉద్యోగులు, ప్రయాణీకులు ఇబ్బందులకు గురయ్యారు. సాంకేతిక సమస్య తలెత్తడంతో ఎర్రమంజిల్‌ మెట్రో స్టేషన్‌ సమీపంలో రైలు ఆగిపోయింది. ఉదయం పూట కావడంతో మెట్రోలో జనాలు అధికంగా ఉన్నారు. మెట్రో ట్రాక్‌పై నిలిచిపోవడంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. దీంతో 20 నిమిషాల పాటు ప్రయాణికులు ఇబ్బంది పడినట్టుగా సమాచారం. మెట్రో రైలు పట్టాలపై నిలిచిపోవడంతో పలువురు సోషల్‌ మీడియా ద్వారా తమ బాధను వ్యక్తం చేశారు. దీనికి సంబంధంచి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Related posts