హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 3లో మతిస్థిమితం లేని ఓ యువకుడు వీరంగం సృష్టించారు. దుస్తులులేకుండా న్యూసెన్స్కు పాల్పడుతూ రాళ్లతో అటునుంచి రాకపోకలు సాగిస్తున్నవారిపై దాడి చేశాడు. అదృష్టవశాత్తు ఎవరికీ గాయాలు కాలేదు. సమాచారం అందుకున్న బంజారాహిల్స్ పెట్రోలింగ్ వాహనం అక్కడకు చేరుకుంది. పోలీసులు వాహనంచూడగానే ఆ యువకుడు మరింత రెచ్చిపోయి రాళ్లతో కారు అద్దాలను ధ్వంసం చేశాడు.దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఎట్టకేలకు పోలీసులు బాధిత యువకుడిని అదుపులోకి తీసుకుని చికిత్స నిమిత్తం ఎర్రగడ్డ మెంటల్ ఆసుపత్రికి తరలించారు.
ఆ యువకుడి గురించి ఆరా తీయగా పేరు అక్షయ్(25)గా గుర్తించారు. తిరుమలగిరిలో నివాసముండే అక్షయ్ హైటెక్ సిటీలోని ఓ సాఫ్ట్వేర్ సంస్థలో పనిచేస్తుంటాడని ఎప్పటిలాగే గురువారం రాత్రి 7 గంటలకు తిరుమలగిరిలో క్యాబ్ ఎక్కి డ్యూటీకి వెళ్లాడని తండ్రి వెల్లడించాడు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
చంద్రబాబు, లోకేశ్ కలిసి రాష్ట్రాన్ని దోచుకున్నారు: రోజా