కొత్తగా కొన్న కారు వాహన పూజ పూర్తి చేసుకుని నిమ్మకాయలు తొక్కించే క్రమంలో అదుపుతప్పింది. ఈ ఘటన శ్రీళైలం సాక్షి గణపతి ఆలయం వద్ద చోటుచేసుకుంది. పూజ సమయంలో కారు అదుపుతప్పి ఆలయంలోని భక్తులపైకి దూసుకెళ్లింది. దీంతో క్యూలైన్ వద్ద తీర్థ ప్రసాదాలు తీసుకుంటున్న ఐదుగురు భక్తులు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఓ మహిళ పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఘటనకు కారణమైన పూజారిపై అదేవిధంగా కారుపై స్థానికులు దాడికి పాల్పడ్డారు.
సినిమా తీసిన ప్రతి హీరోతో గొడవే..పీవీపీపై బండ్ల గణేశ్ ట్వీట్