telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

వాణిజ్య వివాదాలకు ఈ ఫైలింగ్‌ సౌకర్యం: మ‌ంత్రి మేక‌పాటి

Mekapati ycp

సులభతర వాణిజ్య విభాగంలో ఏపీ త‌న‌ అగ్రస్థానాన్ని నిలబెట్టుకొంది. ఈ రోజు కేంద్ర ఆర్థికశాఖ ఈ విషయాని ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. దీనిపై ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్‌ రెడ్డి స్పందిస్తూ.. కరోనా సంక్షోభ‌ పరిస్థితుల్లో ఎంఎస్‌ఎంఈలకు త‌మ స‌ర్కారు తోడ్పాటునిచ్చింద‌ని మేకపాటి గౌతమ్‌ రెడ్డి తెలిపారు.

పరిశ్రమలు మళ్లీ గాడిన‌ప‌డేలా ఆర్థిక తోడ్పాటును అందించార‌ని చెప్పుకొచ్చారు. అలాగే వాణిజ్య వివాదాలకు ఈ ఫైలింగ్‌ సౌకర్యం క‌ల్పిస్తున్నామ‌ని మంత్రి తెలిపారు. పెట్టుబడిదారుల్లో ఏపీకి ఉన్న‌ విశ్వాసాన్ని పరిగణనలోకి తీసుకుని కేంద్ర ప్ర‌భుత్వం ర్యాంకులు ప్ర‌క‌టించింద‌ని చెప్పారు. ఏపీ సింగిల్‌ డెస్క్‌ పోర్టల్‌లో పరిశ్రమలకు భూ కేటాయింపులు ఇస్తున్నామ‌ని తెలిపారు. మురోవైపు విజయవాడ, విశాఖప‌ట్నంలో వాణిజ్య వివాదాలకు ప్రత్యేక కోర్టు ఉంద‌ని మంత్రి తెలిపారు.

Related posts