telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

వైష్ణవ్ తేజ్ జోడీగా .. మేఘా ఆకాశ్..

megha akash with vaishnav tej

వైష్ణవ్ తేజ్ కథానాయకుడిగా దర్శకుడు బుచ్చిబాబు ఒక సినిమాను రూపొందిస్తున్నాడు. సుకుమార్ రైటింగ్స్ .. మైత్రీ మూవీ మేకర్స్ వారు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో వైష్ణవ్ తేజ్ జోడీగా మొదట మనీషా రాజ్ ను తీసుకున్నారు. తెలుగు తెరకి ‘టూ కంట్రీస్’ సినిమా ద్వారా ఈ అమ్మాయి పరిచయమైంది.

కొన్ని కారణాల వలన ఈ ప్రాజెక్టు నుంచి ఆ అమ్మాయిని తొలగించినట్టు తెలుస్తోంది. మనీషా రాజ్ స్థానంలో ‘మేఘా ఆకాశ్’ ను తీసుకోవాలని అనుకుంటున్నారట. ‘లై’ .. ‘ఛల్ మోహన్ రంగ’ ద్వారా తెలుగు ప్రేక్షకులకు మేఘా ఆకాశ్ పరిచయమే. ఆల్రెడీ ఆ అమ్మాయితో సంప్రదింపులు జరుపుతున్నట్టుగా సమాచారం. మేఘా ఆకాశ్ గ్రీన్ సిగ్నల్ ఇస్తుందనే అంటున్నారు. ఈ సినిమాలో ప్రతినాయకుడిగా విజయ్ సేతుపతి కనిపించనున్నాడనే సంగతి తెలిసిందే.

Related posts