telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

మరో క్రేజీ రీమేక్ లో మెగాస్టార్ ?

chiru

2015లో అజిత్ హీరోగా వచ్చిన “వేదాళం” మూవీ భారీ విజయాన్ని అందుకుంది. ఆ మూవీలో అజిత్ మాస్ రోల్ ప్రేక్షకులను బాగా ఫిదా చేసింది. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి తమిళ హిట్ మూవీ “వేదాళం” రీమేక్ లో నటించనున్నారు. ఇక ఈ మూవీ దర్శకుడిగా మెహర్ రమేష్ వ్యవహరిస్తారట. చిరంజీవి ఫ్యామిలీకి బాగా సన్నిహితుడైన మెహర్ ఈ మూవీకి పనిచేయడం ఖాయం అంటున్నారు. ఇక ఈ మూవీని క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ లో కె ఎస్ రామారావు నిర్మించే అవకాశం ఉంది. లేదంటే రామ్ చరణ్ కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ లో నిర్మిస్తారట. ఇక ఈ మూవీ వచ్చే ఏడాది సెట్స్ పైకి వెళ్తుంది. ప్రస్తుతం చిరంజీవి దర్శకుడు కొరటాల శివతో “ఆచార్య” మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే.

Related posts