telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“సైరా”పై మహేశ్ బాబు కామెంట్

Mahesh-and-Chiru

మెగాస్టార్ చిరంజీవి, సూప‌ర్ స్టార్ మ‌హేశ్‌లు ఒకే వేడుక‌లో పాల్గొనడం అనేది కేవలం అరుదైన విషయమే కాదు… అటు మెగా అభిమానులకు, ఇటు మహేశ్ అభిమానులకు కూడా ఆశ్చర్యానందాలను ఇచ్చే దృశ్యం. ఈ అరుదైన దృశ్యం ఆదివారం సాయంత్రం జ‌రిగిన సినీ మ‌హోత్స‌వ వేడుక‌లో చోటు చేసుకుంది. ప్రొడ‌క్ష‌న్ యూనియ‌న్ సిల్వ‌ర్ జూబ్లీ వేడుక గ‌చ్చిబౌలిలో జ‌రిగింది. ఈ వేడుక కృష్ణ‌, కృష్ణంరాజు, త‌ల‌సాని శ్రీనివాస‌యాద‌వ్‌, టి.సుబ్బ‌రామిరెడ్డి, ముర‌ళీమోహ‌న్‌, జ‌య‌ప్ర‌ద‌, జ‌య‌సుధ‌, సుమల‌త‌, రాజేంద‌ప్ర‌సాద్‌, న‌రేశ్‌, కోట‌శ్రీనివాస‌రావు స‌హా ప‌లువురు సినీ పెద్ద‌లు హాజ‌ర‌య్యారు. అయితే మెగాస్టార్ చిరంజీవి, సూప‌ర్‌స్టార్ మ‌హేశ్‌లు క‌లిసి కూర్చుని మాట్లాడుకున్నారు. ఇదే స్పెష‌ల్ ఎట్రాక్ష‌న్‌గా నిలిచింది. ఫొటోల‌న్నీ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యాయి. ఈ సంద‌ర్భంగా మ‌హేశ్‌ మాట్లాడుతూ “చిరంజీవిగారితో మాట్లాడుతుంటే ఓ ఎన‌ర్జీ వ‌స్తుంది. ఆయ‌న ఇప్పుడు ‘సైరా న‌ర‌సింహారెడ్డి’తో మ‌న ముందుకు రాబోతున్నారు. నేను కూడా సైరా కోసం ఎదురుచూస్తున్నాను. సైరా యూనిట్‌కు ఆల్ ది బెస్ట్‌” అన్నారు. అలాగే ప్రొడ‌క్ష‌న్ యూనియ‌న్‌కు మ‌హేశ్‌ అభినంద‌నలు తెలిపారు.

Related posts