telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఐమ్యాక్స్ అధినేతను పరామర్శించిన చిరంజీవి

Chiranjeevi

ప్రముఖ నిర్మాత, ప్రసాద్ గ్రూప్ (ఐమాక్స్, ప్రసాద్ లాబ్స్) ఛైర్మన్ అక్కినేని రమేష్ ప్రసాద్ సతీమణి, శ్రీమతి అక్కినేని విజయలక్ష్మి(77) గురువారం ఉదయం మృతి చెందిన సంగ‌తి తెలిసిందే. హార్ట్ ఎటాక్ కారణంగా ఆమె నిద్రలోనే తుదిశ్వాస విడిచారు. మద్రాసులో జన్మించిన విజ‌య‌ల‌క్ష్మీ రమేష్ ప్రసాద్ ని 1963 జూలైలో వివాహం చేసుకుంది. ఈ దంపతులకు ముగ్గురు అమ్మాయిలు, ఒక అబ్బాయి. గురువారం సాయంత్రం జూబ్లీహిల్స్ ఫిలింనగర్ సమీపంలోగల మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరిగాయి. అయితే సైరా ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాల కోసం ఢిల్లీ వెళ్లిన చిరు ఆమెని క‌డ‌సారి చూపు చూడ‌లేక‌పోయారు. రీసెంట్‌గా హైద‌రాబాద్‌కి రాగా, ఈ రోజు (శుక్రవారం) ఉదయం రమేష్ ప్రసాద్ నివాసానికి చిరంజీవి చేరుకుని ఆయనను పరామర్శించారు. నిర్మాత రమేష్ ప్రసాద్ ఇంటికి వెళ్లి తన ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు చిరు. రమేష్ ప్రసాద్ ను పరామర్శించి ఆయ‌న‌కి ధైర్యాన్ని అందించారు మెగాస్టార్.

Related posts