నిఖిల్ హీరోగా తెరకెక్కిన సినిమా “అర్జున్ సురవరం”. ప్రముఖ నిర్మాత ‘ఠాగూర్’ మధు సమర్పణలో మూవీ డైనమిక్స్ ఎల్ఎల్పి బ్యానర్పై రాజ్ కుమార్ ఆకెళ్ల నిర్మాతగా టి.సంతోష్ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ ఇది. లావణ్య త్రిపాఠి హీరోయిన్. పోసాని కృష్ణమురళి, సత్య, తరుణ్ అరోరా, వెన్నెల కిషోర్, నాగినీడు, విద్యుల్లేఖ రామన్ తదితరులు నటించారు. సామ్ సి.ఎస్ సంగీతం సమకూర్చిన ఈ చిత్రానికి సూర్య సినిమాటోగ్రఫీ అందించారు. ఈ సినిమా ఈనెల 29న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ క్రమంలో చిత్ర ప్రచారంలో భాగంగా ఈనెల 26న హైదరాబాద్లోని పీపుల్స్ ప్లాజాలో ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహిస్తున్నారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా చిరంజీవిని ఆహ్వానించేందుకు ఆయన ఇంటికి నిఖిల్, నిర్మాత రాజ్ కుమార్ వెళ్లారు. ఈ ఈవెంట్కు వస్తున్నానని చిరంజీవి వాళ్లకు హామీ ఇచ్చారు. తన సినిమా ప్రీ రిజీజ్ ఈవెంట్కు మెగాస్టార్ చిరంజీవి వస్తున్నారన్న ఆనందాన్ని నిఖిల్ తట్టుకోలేకపోతున్నారు. “నా ఎగ్జైట్మెంట్ కంట్రోల్ అవ్వట్లే.. గ్యాంగ్ లీడర్లో చెయ్యి చూశావా ఎంత రఫ్గా ఉందో, రఫ్ ఆడిస్తా డైలాగ్ స్కూల్ మొత్తం చెప్పుకుంటూ తిరిగేవాడిని. ఈరోజు ఆ చేయిని పట్టుకునే అదృష్టం దక్కింది. 26న జరిగే ‘అర్జున్ సురవరం’ ప్రీ రిలీజ్ ఈవెంట్కు నా దేవుడు వస్తున్నారన్న విషయం ఇప్పటికీ నాకు షాక్గానే ఉంది” అని ట్వీట్ చేస్తూ ఒక వీడియోను కూడా జత చేశారు నిఖిల్.
Naa Excitement control avvatle… GangLeader lo CHEYY CHUSAVA ENTHA ROUGH GA UNDO, ROUGHHH AADISTHA dialogue school mottam cheppukuntu tirigevadini… ee roju I’m blessed to shake That Hand…nd still in shock that my IDOL is coming to the #ArjunSuravaram PRE RELEASE ON 26th 🙏🏽 pic.twitter.com/gDsFl9oETx
— Nikhil Siddhartha (@actor_Nikhil) 23 November 2019
టీడీపీకి అసలైన వారసుడు ఎన్టీఆర్ : ఆర్జీవీ