telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“సరిలేరు నీకెవ్వరు” ప్రీ రిలీజ్ ఈవెంట్ కు మెగాస్టార్ ?

Mahesh-and-Chiru

అనీల్ రావిపూడి దర్శకత్వంలో సూపర్ స్టార్ మ‌హేష్ బాబు హీరోగా రూపొందుతున్న చిత్రం “స‌రిలేరు నీకెవ్వ‌రు”. 90లలో లేడీ సూపర్‌స్టార్‌గా అద్భుతమైన స్టార్‌డమ్‌ సంపాదించిన విజ‌య‌శాంతి మ‌ళ్ళీ 13 ఏళ్ళ త‌ర్వాత “స‌రిలేరు” నీకెవ్వ‌రు అనే చిత్రంతో రీ ఎంట్రీ ఇస్తుండ‌డంతో ఈ సినిమాపై ఆమె అభిమానుల‌లో చాలా ఆస‌క్తి నెల‌కొంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న స‌రిలేరు నీకెవ్వ‌రు చిత్రంలో మ‌హేష్ మేజర్‌ అజయ్‌ కృష్ణ పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు. ఆయ‌న స‌ర‌స‌న‌ ర‌ష్మిక మందన్న క‌థానాయిక‌గా న‌టిస్తుంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. చిత్రాన్ని దిల్ రాజు, అనిల్ సుంకర, మహేష్ సంయుక్తంగా నిర్మిస్తుండగా, సంక్రాంతి కానుక‌గా జ‌నవ‌రి 11న విడుద‌ల కానుంది. సంక్రాంతికి సూపర్‌స్టార్ మహేష్ బాబు `సరిలేరు నీకెవ్వరు`, స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్ `అల వైకుంఠపురములో..` చిత్రాలు బాక్సాఫీస్ వేదికగా పోటీపడుతున్నాయి. ఒక రోజు తేడాతో థియేటర్లలోనికి రాబోతున్నాయి. పోటాపోటీగా పబ్లిసిటీ నిర్వహిస్తున్న ఈ రెండు చిత్రాల ప్రీ-రిలీజ్ ఫంక్షన్లూ ఒకే రోజున జరుగబోతున్నాయి. వచ్చే నెల ఐదో తేదీన హైదరాబాద్‌లో `సరిలేరు నీకెవ్వరు` ఫంక్షన్, అదే రోజు విశాఖపట్నంలో `అల వైకుంఠపురములో..` ఈవెంట్ జరుగబోతున్నాయి. మహేష్ సినిమా ఫంక్షన్‌కు ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి హాజరు కాబోతున్నట్టు సోషల్ మీడియాలో తీవ్రంగా ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు మెగాస్టార్ అంగీకరించినట్టు కూడా వార్తలు వస్తున్నాయి. ఇటీవలి కాలంలో బయటి హీరోల ఫంక్షన్లకు చిరంజీవి తరచుగా హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలో మహేష్ సినిమా ఫంక్షన్‌కు రావడానికి కూడా ఓకే అన్నారని తెలుస్తోంది. మరి, ఇందులో నిజమెంతుందో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.

Related posts