telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

మా అసోసియేషన్ ఎన్నికలు.. : నాగబాబు ఒకవైపు.. చిరంజీవి మరోవైపు.. !

Nagababu-with-Naresh

‘మా’ అసోసియేషన్ ఎన్నికలు రాజకీయ రణరంగాన్ని గుర్తుచేస్తున్నాయి. ఈ ఎన్నికల్లో శివాజీరాజా, వీకే నరేష్ వర్గాలు మా పీఠాన్ని దక్కించుకొనేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నాయి. అన్ని వర్గాల నుంచి మద్దతు కూడగట్టుకొనేందుకు అన్ని అస్త్రాలను కూడగట్టుకొంటున్నాయి. అంతా సవ్యంగా సాగుతున్నదని భావిస్తున్న సమయంలో హీరో రాజశేఖర్ కుటుంబాన్ని పరోక్షంగా టార్గెట్ చేస్తూ వివాదాస్పద నటి శ్రీరెడ్డి వ్యాఖ్యలు చేయడంతో ఎన్నికల సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి. మెగా హీరోలు తలోదారి పట్టేందుకు ఆస్కారం ఏర్పడింది.

ఈ ఎన్నికల్లో శివాజీ రాజా వర్గం మొదటి నుంచి దూకుడుగా ప్రచారం సాగిస్తున్నది. మెగాస్టార్ చిరంజీవిని కలిసి మద్దతు కూడగట్టారు. దానితో వారి గెలుపు సులభమనే అభిప్రాయం వ్యక్తమైంది. అయితే ఈ క్రమంలో హీరో రాజశేఖర్ కుటుంబంపై శ్రీరెడ్డి అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేస్తూ.. శివాజీ రాజా వర్గానికి మద్దతు తెలపడంతో సీన్ రివర్స్ అయింది.

నాగబాబు, శ్రీ రెడ్డి వ్యాఖ్యల చేయనంత వరకు తటస్థంగా ఉన్న తన స్టాండ్ మార్చుకొన్నారు. తను సీనియర్ నటుడు వీకే నరేష్ ప్యానల్‌కు మద్దతు తెలుపుతున్నట్టు బహిరంగ ప్రకటన చేశారు. వారితో కలిసి ప్రచారంలో పాల్గొనడంతో శివాజీ రాజా వర్గానికి షాక్ తగిలినట్టు అయింది. ఇలా నాగబాబు అనూహ్య నిర్ణయం తీసుకోవడం సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

చిరంజీవి సపోర్టు మాకే ఉందని, మెగా ఫ్యామిలీలో కొందరు మా వర్గానికే శివాజీ రాజా ప్యానెల్ ప్రచారం చేసుకొంటున్నది. అయితే చిరంజీవి మాత్రం బహిరంగంగా ఎవరికి మద్దతు ఇస్తున్నారో ప్రకటించలేదు. కానీ శ్రీరెడ్డి ఉదంతం వల్ల నాగబాబు మాత్రం తన వైఖరిని స్పష్టం చేయడం సెన్సేషన్‌గా మారింది. అయితే మెగా ఫ్యామిలీ హీరోలు ఎవరు ఎటువైపు ఉన్నారనే విషయంలో స్పష్టత కనిపించడం లేదనే వాదన వినిపిస్తున్నది.

Related posts