telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“పిచ్చి కుక్కలతో జాగ్రత్త…” నాగబాబు పోస్ట్ వివాదాస్పదం

Nagababu

మెగా బ్రదర్ నాగబాబు ప్రభుత్వ పెద్దలతో ఇండస్ట్రీ పెద్దల మీటింగ్‌కి తనను పిలవ లేదంటూ బాలయ్య చేసిన వ్యాఖ్యలపై స్పందించిన విధానం వివాదాస్పదమైన విషయం తెలిసిందే. అయితే నాగబాబు వ్యాఖ్యలపై బాలయ్య ఫ్యాన్స్ తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. స్నేక్ బాబు, సూసైడ్ స్టార్ అంటూ నాగబాబుని ఓ రేంజ్‌లో ట్రోల్ చేస్తున్నారు. ఎన్నికల ముందు బాలయ్య ఎవరో తెలియదంటూ నోటి కొచ్చినట్టు మాట్టాడిన నాగబాబు.. బాలయ్య ఎవరో తెలియకుండానే క్షమాపణ చెప్పమంటున్నారా? ఇంతకీ నాగబాబు ఏ బాలయ్యకి క్షమాపణ చెప్పమన్నారంటూ సెటైర్లు వేస్తున్నారు. ఈ తరుణంలో తనను ట్రోల్ చేస్తున్న వారిని పిచ్చి కుక్కలతో పోల్చుతూ మరో వివాదాస్పద పోస్ట్ చేశారు నాగబాబు. పళ్లు బయటకు పెట్టి అరుస్తూ భయంకరంగా ఉన్న పిచ్చి కుక్క ఫొటోని ట్విట్టర్‌లో షేర్ చేస్తూ.. “పిచ్చి కుక్కలు చాలా డేంజర్.. జాగ్రత్తగా ఉండాలని ప్రజారోగ్యశాఖ చెబుతోంది. అలాంటి కుక్కల్ని నిర్బంధంలోనైనా ఉంచాలి. చంపేయాలి.. కానీ అలా వదిలేయకూడదు. అవి జీవితాన్ని బలి తీసుకుంటాయి. అసలే ఇది పిచ్చి కుక్కల సీజన్” అంటూ ట్వీట్ చేశారు నాగబాబు. ఆయన వ్యాఖ్యలపై నందమూరి అభిమానులు, మెగా అభిమానుల మధ్య పెద్ద వార్ నడుస్తోంది.

Related posts