telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

ఏపీ రాజధానిపై … ప్రభుత్వ-ప్రతిపక్షాల పోటాపోటీ సమావేశాలు..

ycp letter to CS on praja vedika building

ఏపీ రాజధాని అమరావతి నిర్మాణంపై ప్రభుత్వ-ప్రతిపక్ష నేతలు పోటాపోటీ సమావేశాలు ఏర్పాటు చేస్తున్నాయి. విజయవాడలో టీడీపీ అధినేత చంద్రబాబు ఆధ్వర్యంలో ప్రజారాజధాని అమరావతి పేరుతో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసింది. ఈ మీటింగ్‌కు 17 పార్టీలకు ఆహ్వానం పంపించారు. 22 విభాగాలు, సంఘాలను కూడా టీడీపీ ఆహ్వానించింది. సంపద సృష్టి, పేదరిక నిర్మూలన, ఉపాధి కల్పన అజెండాగా సమావేశం ఏర్పాటు చేసినట్లు టీడీపీ నేతలు చెబుతున్నారు. భూసేకరణకు సమయం పట్టిందని టీడీపీ నేతలు వాదించనున్నట్టు తెలుస్తుంది. 29 గ్రామాల భూములు తీసుకొని, నిధులు వెచ్చించి చేపట్టిన పనుల నిర్మాణంపై వివరిస్తారు. రాజధాని మార్పుపై పూటకో మాట మాట్లాడి ప్రజల్లో అభద్రతాభావం కలిగిస్తున్నారనే విషయంపై కూడా రౌండ్ టేబుల్ సమావేశం దృష్టిపెట్టనుంది. చంద్రబాబు బస్సు పర్యటన సమయంలో జరిగిన ఆందోళనను ఈ మీటింగ్‌లో ప్రస్తావించే అవకాశం ఉంది. అన్ని రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాల అభిప్రాయాలను తీసుకుని… రాజధానిపై పోరాటాన్ని ఉదృతం చేయాలని చంద్రబాబు భావిస్తున్నారు.

వైసీపీ వర్గాలు కూడా రాజధాని ప్రాంత రైతులు రాజధాని నిజస్వరూపం పేరుతో సదస్సు నిర్వహిస్తున్నారు. ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ఈ సమావేశంకు హాజరు కానున్నారు. తుళ్లూరులో 11 గంటలకు రాజధాని అంశంపై వివిధ పార్టీల నేతలు, ప్రజాసంఘాలతో ఈ సమావేశం ఉంటుంది. అమరావతి అసలు కోణం… కుంభకోణం శీర్షికన జరిగే ఈ సమవేశంలో అమరావతి పేరుతో గత టీడీపీ ప్రభుత్వం చేసిన కుంభకోణాలు, భూదందాలు, అవినీతిపై చర్చిస్తారు. రాజధాని ప్రాంత రైతులకు, రైతు కూలీలకు, అసైన్డ్‌ రైతులకు, రాజధానిలో సామాన్యులకు జరిగిన అన్యాయంపై సమావేశంలో ప్రధానంగా చర్చిస్తారు. అమరావతిలో రాజధానిపై పోటా పోటీ సమావేశాలు. రాజకీయాలు చలిలో కూడా వేడి పుట్టిస్తున్నాయి. రాజధాని భవిశ్యత్తు ప్రశ్నార్థకంగా ఉన్న నేపథ్యంలో తమ వాదన ప్రజల దృష్టికి తీసుక వెళ్లేందుకు అధికార, విపక్షాలు తమతమ ప్రయత్నాలు చేస్తున్నాయి.

Related posts