నేడు ఆర్టీసీ సమ్మె పై సీఎం కేసీఆర్ సుదీర్ఘంగా సాగిన సమీక్ష ముగిసింది. ప్రైవేట్ ఆపరేటర్లకు ఆర్టీసీలో ఎలా అనుమతులు ఇవ్వాలనే దానిపై దాదాపు ఏడున్నర గంటల పాటు చర్చించారు. ప్రైవేట్ ఆపరేటర్లకు స్టేజ్ క్యారియర్లుగా అనుమతి ఇచ్చేందుకు విధి విధానాలు ఖరారు చేయాలని ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు.
ఇతర రాష్ట్రాల్లో ఉన్న పద్ధతులను అధ్యయనం చేయాలని, న్యాయపరమైన చిక్కులు రాకుండా చూడాలని సూచించారు. గురువారం కోర్టు విచారణ తర్వాత సీఎం కేసీఆర్ అధికారిక నిర్ణయం తీసుకోనున్నారు.