కాకినాడలోని మరో దారుణం చోటు చేసుకుంది. ఆంద్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా లోని పారా మెడికల్ విద్యార్థిని దారుణ హత్య గురైంది. ప్రేమించి పెళ్లి చేసుకుని భార్యనే కడతేర్చాడు ఓ కసాయి భర్త. పెళ్లైన పది నెలలకే ఆమెపై ఇంతటి ఘాతుకానికి ఒడిగట్టాడు. దాంపత్యంలో ఉన్న మనస్పర్థల కారణంగా ఓ పారా మెడికల్ విద్యార్థిని అత్యంత దారుణంగా హతమార్చాడు భర్త. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
వివరాల్లోకి వెళితే..
పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం రూరల్ మండలం కాకిపాడుకు చెందిన గుంపుల సుధారాణి (19) ప్రస్తుతం కాకినాడ రంగరాయ మెడికల్ కళాశాలలో డిప్లొమా ఇన్ ఎనస్తీషియా ప్రథమ సంవత్సరం చదువుతోంది. ఈ క్రమంలోనే సుధారాణికి 21 యేళ్ల మానేపల్లి గంగరాజుతో పరిచయం ఏర్పడింది. ఇది కాస్తా కొద్ది రోజులకు .. ఇద్దరి మధ్య ప్రేమకు దారి తీసింది. అలా కొద్ది రోజులు గడిపిన తరువాత పది నెలల కిందట ప్రేమ వివాహం చేసుకుంది ఈ జంట. సుధారాణి హాస్టల్లో ఉంటూ కాకినాడ రంగరాయ మెడికల్ కళాశాలలో చదువుకుంటోంది. భర్త గంగరాజు ఊర్లో ఉంటున్నాడు.
అయితే, ఈనెల 17న తన భర్త కాకినాడ రావడంతో స్థానిక కోకిల సెంటర్లోని ద్వారకా లాడ్జిలో రూమ్ తీసుకున్నారు. ఆదివారం రాత్రి ఇద్దరి మధ్య చిన్న గొడవకు వాగ్వివాదం చోటుచేసుకుంది. దీంతో గంగరాజు క్షణికావేశంలో పదునైన ఆయుధంతో తన భార్య సుధారాణిని విచక్షణారహితంగా పొడిచి హత్య చేశాడు.
అనంతరం నిందితుడు అక్కడి నుంచి పారిపోయి సోమవారం ఏలూరు టూటౌన్ పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. అక్కడి పోలీసులు ఇచ్చిన సమాచారంతో కాకినాడ ఎస్డీపీవో వి.భీమారావు, టూటౌన్ ఎస్ఐ పి.ఈశ్వరుడు సోమవారం రాత్రి సంఘటనా స్థలికి చేరుకుని మృతదేహన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. హత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు..
ఆ సీఐకి అన్నీ తెలుసు..వివేకా కూతురు