తెలంగాణలో మేనేజ్మెంట్ కోటా కింద ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్ కోర్సులో ప్రవేశానికి ఈ నెల 23వ తేదీన ఆన్లైన్ కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. యూనివర్సిటీ గుర్తింపు పొందిన మైనారిటీ, నాన్ మైనారిటీ కాలేజీల్లో మేనేజ్మెంట్ కోటా బీ, సీ కేటగిరి సీట్ల భర్తీకి ఆన్లైన్ కౌన్సెలింగ్ చేపట్టనున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ ప్రాంగణంలోని ప్రొ.రాంరెడ్డి దూర విద్యాకేంద్రం విభాగంలో సర్టిఫికేట్ల వేరిఫికేషన్, ఆన్లైన్ కౌన్సెలింగ్ ఉంటుందని వెల్లడించింది.
యూనివర్సిటీ విడుదల చేసిన మేనేజ్మెంట్ కోటా మెరిట్ లిస్టులోని అభ్యర్థులందరు మొదటి ర్యాంకు నుంచి చివరి ర్యాంక్ వరకు ర్యాంకుల వారీగా నిర్దేశించిన సమయంలో కౌన్సెలింగ్కు హాజరుకావాల్సి ఉంటుందని పేర్కొన్నారు. మేనేజ్మెంట్ కోటా మొదటి విడత సీట్లు కేటాయించిన కళాశాలల్లో చేరిన విద్యార్థులు రెండవ విడత కౌన్సెలింగ్కు అనర్హులు. బీడీఎస్ సీట్లకు విడిగా మరో నోటిఫికేషన్ ద్వారా సీట్లు భర్తీ చేస్తారు. మరింత సమాచారం కోసం www.knruhs.telangana.gov.in వెబ్సైట్ను సంప్రదించాలని యూనివర్సిటీ అధికారులు తెలిపారు.
ఎమ్మెల్యే రోజావి పగటి కలలు: టీడీపీ ఎమ్మెల్యే అనిత