telugu navyamedia
రాజకీయ

యూపీ సీఎం డ్రామాలు ఆడుతున్నారు: మాయావతి

Mayawati Welcomes Reservation To Upper Castes
లోక్  సభ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు యూపీ సీఎం యోగి ఆదిత్యానాధ్‌ డ్రామాలు చేస్తూన్నారని బీఎస్పీ అధినేత్రి మాయావతి మండిపడ్డారు. యూపీ సీఎం ఈసీ విధించిన నిషేధ ఉత్తర్వులను ఉల్లంఘించారని  మాయావతి గురువారం ఆరోపించారు. ఆలయాలను సందర్శించడం, దళితుల ఇళ్లలో ఆహారం స్వీకరించడం వంటి చర్యలతో  ఈసీ ఉత్తర్వులను ఉల్లంఘించారని ఆమె ఆరోపించారు. యూపీ సీఎం ఎన్నికల నియమావళిని ఉల్లంఘించినా ఈసీ చూసీచూడనట్టు వదిలేస్తోందని ఆమె ఆరోపించారు. ఈసీ బీజేపీ నేతల పట్ల సానుకూలంగా వ్యవహరిస్తోందని అన్నారు. 
బీజేపీ నేతల చర్యలను ఈసీ పట్టించుకోకుంటే ఎన్నికలు స్వేచ్ఛగా నిర్వహించడం అసాధ్యమని చెప్పారు. కాగా, మాయావతి ఆరోపణలను యూపీ సీఎం మీడియా సలహాదారు మృత్యుంజయ్‌ కుమార్‌ తోసిపుచ్చారు.వ్యక్తిగత హోదాలో ప్రార్థనలు చేసుకునేందుకు ఆలయాలను సందర్శించడం, ఎవరైనా పిలిచినప్పుడు వారి ఇంటికి వెళ్లి భోజనం చేయడం ఈసీ ఉత్తర్వులను ఉల్లంఘించడం ఎలా అవుతుందని ఆయన ప్రశ్నించారు.

Related posts