telugu navyamedia
క్రైమ్ వార్తలు తెలంగాణ వార్తలు వార్తలు సామాజిక

అధిక రేట్లకు మాస్క్‌లు.. హైద్రాబాద్ లో వ్యాపారి అరెస్ట్‌

polution mask delhi

కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో అవసరాన్ని ఆసరాగా చేసుకొని కొందరు వ్యాపారస్తులు అధిక రేట్లకు మాస్క్‌లు విక్రయిస్తున్నారు. విషయం తెలుసుకున్న టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు హైద్రాబాద్ నగరంలో దాడులు నిర్వహించారు. ఇందులో భాగంగా నాణ్యత లేని మాస్క్‌లు ఒక్కొక్కటి రూ. 20కి పైగా విక్రయిస్తున్న ఓ వ్యాపారిని అరెస్ట్‌ చేసి, అతని వద్ద నుంచి 10 వేల మాస్క్‌లు స్వాధీనం చేసుకున్నారు.

టాస్క్‌ఫోర్స్‌ పోలీసుల కథనం ప్రకారం.. జియాగూడ ఇమామ్‌పురాకు చెందిన గణేశ్‌ ఓత్కర్‌ వృత్తి రీత్యా మాస్క్‌లను తయారు చేసే వ్యాపారాన్ని కొన్నేండ్లుగా నిర్వహిస్తున్నాడు. కరోనా వైరస్‌తో మాస్క్‌లకు గిరాకీ బాగా పెరిగింది. దీన్ని ఆసరాగా చేసుకొని ఒక్కొక్కటి రూ. 20 విక్రయిస్తుండడంతో వెస్ట్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు  అతని ఇంటిపై దాడి చేయడంతో విక్రయానికి సిద్దంగా ఉన్న 10 వేల డిస్పోజబుల్‌ మాస్క్‌లు పోలీసులకు లభించాయి. దీంతో నిందితుడిపై కేసు నమోదు చేసుకొని, మాస్క్‌లను, ఒక సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు.

Related posts