వినియోగదారులకు మారుతి సుజుకీ బంపర్ ఆఫర్ ప్రకటించింది. నెక్సా సిరీస్ కు చెందిన బాలెనో ఆర్ మోడల్ కార్లపై ఏకంగా రూ. లక్ష తగ్గించింది. కొన్ని సెలెక్టెడ్ మోడళ్లపై రెండు రోజుల క్రితమే రూ. 5 వేలను తగ్గిస్తున్నట్టు మారుతి ప్రకటించింది. కార్పొరేట్ ట్యాక్స్ తగ్గిస్తున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన నేపథ్యంలో మారుతి సుజుకి ఈ నిర్ణయానికి వచ్చింది.
బాలెనో ఢిల్లీ ఎక్స్ షోరూమ్ ధరను రూ. 5,58,000గా నిర్ణయించింది. దీపావళి సీజన్ లో కూడా కార్ల ధరలను తగ్గించే యోచనలో మారుతి యాజమాన్యం ఉన్నట్టు తెలుస్తోంది. మారుతి తీసుకున్న నిర్ణయంతో ఇతర కంపెనీలు కూడా ధరలను తగ్గించే అవకాశం ఉందని మార్కెట్ నిపుణుల చెబుతున్నారు.
ఢిల్లీలో లా అండ్ ఆర్డర్ పరిస్థితి దారుణం: కేజ్రీవాల్