ఎన్నికలు సమర్పిస్తున్న నేపథ్యంలో గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలో మావోయిస్టుల లేఖలు కలకం రేపాయి. అవినీతి, భూకబ్జాదారులు తమ పద్ధతి మార్చుకోవాలని మావోయిస్టులు లేఖలో హెచ్చరించారు. కిడారి సర్వేశ్వర రావుకు పట్టిన గతే గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస రావుకు పడుతుందని హెచ్చరించారు.
మావోయిస్టులు. యరపతినేనితో పాటు పలువురు టీడీపీ నేతలను హెచ్చరిస్తూ దాచేపల్లి స్కూల్ వద్ద లేఖలు విడుదల చేశారు. ఎన్నికలకు సిద్ధమవుతున్న సమయంలో మావోయిస్టు పార్టీకి చెందిన లేఖలు దర్శనమివ్వడం చర్చనీయంశంగా మారింది. గురజాల టీడీపీ ఎమ్మెల్యే యరపతినేని తో పాటు నాయీబ్రాహ్మణ ఫెడరేషన్ ఛైర్మన్ గుంటుపల్లి నాగేశ్వరరావు, దాచేపల్లి ఎంపీపీ నవకుమార్, టీడీపీ నేతలు తంగెళ్ల శ్రీనివాసరావు, మునగ నిమ్మయ్య, పగడాల భాస్కర్ లకు హెచ్చరికలు జారీ చేశారు.