telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

కిడ్నాప్ కథ సుఖాంతం.. టీఆర్ఎస్ నేతను వదిలేసిన నక్సల్స్

naksals encounter

తెలంగాణ లో ఓ టీఆర్ఎస్ నేతను నక్సలైట్లు నాలుగు రోజుల క్రితం కిడ్నాప్ చేసిన సంగతి తెలిసిందే. అతని జాడ తెలియకపోవడంతో నిన్నటి వరకు కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. ఎట్టకేలకు ఈ రోజు ఉదయం మావోయిస్టులు అతన్ని వదిలేశారు. భద్రాద్రి జిల్లా చర్ల మండలానికి చెందిన మాజీ ఎంపీటీసీ, టీఆర్ఎస్ పార్టీ నాయకుడు నల్లూరి శ్రీనివాస్ ను మావోలు నాలుగు రోజుల క్రితం అర్ధరాత్రి ఆయన ఇంటికి వచ్చి వెంట తీసుకెళ్లారు. అనంతరం ఆయన ఆచూకీ తెలియకపోవడంతో కుటుంబ సభ్యుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తం అయింది. శుక్రవారం ఉదయం శ్రీనివాస్‌ను మావోయిస్టులు వదిలేయడంతో ఆయన క్షేమంగా ఇంటికి చేరుకోవడంతో కుటుంబ సభ్యుల్లో ఆనందం వ్యక్తమవుతోంది.

Related posts