telugu navyamedia
క్రైమ్ వార్తలు రాజకీయ వార్తలు

రెచ్చిపోయిన మావోయిస్టులు.. 16 వాహనాలకు నిప్పు

Two moists killed encounter vishakha

జార్ఖండ్‌లో మావోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు. లతేహార్‌ జిల్లాలో 16 వాహనాలను నక్సల్స్ తగులబెట్టారు. ఆరుగురి కూలీలపై దాడికి పాల్పడ్డారు. దాడికి పాల్పడింది తామేనని జార్ఖండ్‌ జన్‌ముక్తీ పరిషత్‌(జేజేఎంపీ) పేర్కొంది. మావోయిస్టులు మొదటగా థోరి రైల్వే స్టేషన్‌పై దాడి చేశారు. అనంతరం అక్కడినుంచి కిందకు దిగి కూలీలు నిద్రించే ప్రాంతానికి చేరుకున్నారు.

కూలీల వద్ద నుంచి సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అక్కడ పార్క్‌ చేసిన 16 వాహనాలకు నిప్పంటించారు. దాదాపు 15 మంది నక్సల్స్‌ విచక్షణారహితంగా గాల్లోకి కాల్పులు జరిపినట్లుగా ప్రత్యక్ష సాక్ష్యులు పేర్కొన్నారు. థోరి నుంచి బోగ్గు రవాణాను వ్యతిరేకిస్తూ వీరు దాడికి పాల్పడ్డట్లుగా సమాచారం.

Related posts