ఒడిశాలోని కందమాల్ జిల్లా అటవీప్రాంతంలో తుపాకుల మోతమోగింది. సిర్లా అటవీప్రాంతంలో భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య భారీ ఎన్ కౌంటర్ జరిగింది. ఈ కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. మరికొందరు మావోలు తప్పించుకున్నారు.
తప్పించుకున్న దళ సభ్యుల కోసం సిర్లా అడవుల్లో గాలింపు చేపట్టారు. ఘటన స్థలంలో భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. మరణించిన మావోలను వంశధార-నాగావళి-గుంసూరు డివిజన్ దళ సభ్యులుగా భావిస్తున్నారు.