ఆంధ్రా, ఒడిశా సరిహద్దు (ఏవోబీ)లో మావోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు. కిరండోల్ నుంచి విశాఖకు ఇనుప ఖనిజాన్ని రవాణా చేసే ఎస్సార్ కంపెనీకి చెందిన పైప్లైన్ను శనివారం అర్ధరాత్రి ధ్వంసం చేశారు. ఛత్తీ్సగఢ్ రాష్ట్రం కిరండోల్ నుంచి విశాఖపట్నంలోని ఎస్సార్ కంపెనీకి పైప్లైన్ ద్వారా ముడి ఇనుప ఖనిజం సరఫరా అవుతుంది. ఛత్తీ్సగఢ్తోపాటు నుంచి మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన ఒడిశాలోని చిత్రకొండ జాన్బాయ్ మీదుగా ఈ పైప్లైన్ ఉంది.
దీనిలో ఇనుప ఖనిజంతోపాటు నీటిని కూడా సరఫరా చేస్తారు. ఇందుకోసం కిరండోల్, చింత్రకొండ జాన్బాయ్ సమీపంలో పంపింగ్ స్టేషన్లను నిర్మించారు. జాన్బాయ్ ప్రాంతం మావోయిస్టులకు షెల్టర్ జోన్ కావడంతో ఉనికిని చాటుకునేందుకు ఇలాంటి చర్యలకు పాల్పడుతారు. ఇదే తరహాలో శనివారం అర్ధరాత్రి జాన్బాయ్ దిగువజనభ ప్రాంతంలో ఎస్సార్ పైప్లైన్ను ధ్వంసం చేశారు. కాగా ఈ ఘటనపై మావోయిస్టులు ఇంతవరకు ఎటువంటి ప్రకటన విడుదల చేయలేదు.
ముస్లింలపై విరుచుకుపడటం తగదు..మోదీపై ఒవైసీ సంచలన వ్యాఖ్యలు