telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్ వార్తలు

ప్రపంచ బాక్సింగ్‌ ఛాంపియన్స్‌షిప్స్‌ : .. ఫైనల్స్ కు చేరుకున్న .. మంజురాణి …

manjurani in finals of world championship

ఛాంపియన్స్‌షిప్స్‌ 48 కేజీల విభాగంలో భారత బాక్సర్‌ మంజురాణి ఫైనల్‌కు దూసుకెళ్లింది. సెమీఫైనల్లో థాయిలాండ్‌ క్రీడాకారిణి రాక్షత్‌ను 4-1 తేడాతో ఆమె మట్టికరిపించింది. దీంతో మంజు పసిడికి ఒక్క అడుగు దూరంలో మాత్రమే నిలిచింది. హరియాణాకు చెందిన ఆమె క్వార్టర్స్‌లో ఉత్తరకొరియా బాక్సర్‌ను ఓడించి సెమీస్‌లో అడుగుపెట్టింది. ఈ ఏడాది బల్గేరియాలో జరిగిన స్ట్రాండ్‌జ మెమొరియల్‌ బాక్సింగ్‌ పోటీల్లో ఆమె రజత పతకం కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే.

మరో భారత బాక్సర్‌ జమునా బోరో 54 కేజీల విభాగం సెమీఫైనల్లో ఓటమి పాలైంది. చైనా క్రీడాకారిణి చేతిలో 0-5తేడాతో ఓటమిపాలై కాంస్యంతో సరిపెట్టుకుంది. భారత స్టార్‌ బాక్సర్‌ మేరీకోమ్‌ కూడా సెమీస్‌లో ఓడిన సంగతి తెలిసిందే. 51 కేజీల విభాగంలో టర్కీ బాక్సర్‌ బుసెనాజ్‌ చేతిలో 1-4 తేడాతో ఓడి కాంస్యం పతకాన్ని అందుకుంది. దీంతో ప్రపంచ బాక్సింగ్‌ ఛాంపియన్స్‌షిప్స్‌లో ఎనిమిది పతకాలు సాధించిన బాక్సర్‌గా మేరీకోమ్‌ రికార్డు సృష్టించింది. ఆమె ఆరు పసిడి, ఒక రజతం, మరో కాంస్యం గెలుచుకుంది.

Related posts