ఛాంపియన్స్షిప్స్ 48 కేజీల విభాగంలో భారత బాక్సర్ మంజురాణి ఫైనల్కు దూసుకెళ్లింది. సెమీఫైనల్లో థాయిలాండ్ క్రీడాకారిణి రాక్షత్ను 4-1 తేడాతో ఆమె మట్టికరిపించింది. దీంతో మంజు పసిడికి ఒక్క అడుగు దూరంలో మాత్రమే నిలిచింది. హరియాణాకు చెందిన ఆమె క్వార్టర్స్లో ఉత్తరకొరియా బాక్సర్ను ఓడించి సెమీస్లో అడుగుపెట్టింది. ఈ ఏడాది బల్గేరియాలో జరిగిన స్ట్రాండ్జ మెమొరియల్ బాక్సింగ్ పోటీల్లో ఆమె రజత పతకం కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే.
మరో భారత బాక్సర్ జమునా బోరో 54 కేజీల విభాగం సెమీఫైనల్లో ఓటమి పాలైంది. చైనా క్రీడాకారిణి చేతిలో 0-5తేడాతో ఓటమిపాలై కాంస్యంతో సరిపెట్టుకుంది. భారత స్టార్ బాక్సర్ మేరీకోమ్ కూడా సెమీస్లో ఓడిన సంగతి తెలిసిందే. 51 కేజీల విభాగంలో టర్కీ బాక్సర్ బుసెనాజ్ చేతిలో 1-4 తేడాతో ఓడి కాంస్యం పతకాన్ని అందుకుంది. దీంతో ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్స్షిప్స్లో ఎనిమిది పతకాలు సాధించిన బాక్సర్గా మేరీకోమ్ రికార్డు సృష్టించింది. ఆమె ఆరు పసిడి, ఒక రజతం, మరో కాంస్యం గెలుచుకుంది.
మొత్తానికి రజినీకాంత్ తప్పించుకున్నారు… విజయ్ ఇరుక్కున్నారు… డీఎంకే నేత వివాదాస్పద వ్యాఖ్యలు