telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

కార్యకర్తలకు క్రమశిక్షణ ఎంతో అవసరం: మాణిక్యం ఠాగూర్

Manikam Tagore Congress

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సమావేశం జూమ్ యాప్ ద్వారా నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన ఇన్చార్జి మాణిక్యం ఠాగూర్ మాట్లాడుతూ పార్టీ నేతలు, కార్యకర్తలకు క్రమశిక్షణ ఎంతో అవసరమని ఉద్ఘాటించారు.

సోషల్ మీడియాను ఇష్టానుసారం ఉపయోగించుకోవద్దని సూచించారు. ఇకపై ప్రతి 15 రోజులకు ఒకసారి కోర్ కమిటీ సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలని, ప్రతి అంశంలోనూ పార్టీ సిద్ధాంతపరమైన సామాజిక న్యాయాన్ని తప్పనిసరిగా పాటిద్దామని పిలుపునిచ్చారు.

మేదక్ జిల్లా దుబ్బాక ఉప ఎన్నిక, గ్రేటర్ హైదరాబాద్, ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్ ఎన్నికలు, పట్టభద్రుల మండలి ఎన్నికల అంశంపైనా ఆయన చర్చించారు. దుబ్బాక ఉప ఎన్నిక, గ్రాడ్యుయేట్ మండలి ఎన్నికలకు త్వరగా అభ్యర్థులను ఎంపిక చేయాలని స్పష్టం చేశారు. 

Related posts