తెలంగాణ రాష్ట్రంలో జూన్ లో జరగనున్న మండల పరిషత్ ఎన్నికలకు రిజర్వేషన్లు ఖరారయ్యాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ స్థానాలపై జిల్లాల వారిగా స్పష్టత వచ్చింది. జిల్లాల కోటా ఆధారంగా కేటాయింపులను ఆయా కలెక్టర్లు చేపట్టనున్నారు. మూడు జిల్లాల్లో బీసీలకు ఒక్క ఎంపీపీ స్థానం దక్కలేదు. షెడ్యూల్, నాన్ షెడ్యూల్ కలిపి ఎస్టీలకు 92, ఎస్సీలకు 98, బీసీలకు94 స్థానాలు కేటాయించారు. సుప్రీంకోర్టు ఆదేశాలు, పంచాయతీరాజ్ చట్టం 2018 ప్రకారం 50 శాతానికి మించకుండా రిజర్వేషన్లు అమలుపరచాల్సి రావడంతో బీసీలకు స్థానాలు తగ్గాయి. గిరిజన ప్రాంతాలలోని స్థానాలను వారికే కేటాయించాలన్న నిబంధనలతో వారికి అధికంగా పదువులు దక్కే అవకాశం ఉంది.
మోడీ సమావేశాలు పెట్టుకుంటే తప్పు లేదా: చంద్రబాబు