లాక్డౌన్ నేపథ్యంలో ఇళ్లకే పరిమితమైన సెలబ్రిటీలు తమ రోజువారీ పనుల తాలుకూ విషయాలను వీడియో రూపంలో ప్రేక్షకులతో షేర్ చేసుకుంటున్నారు. ఈ సమయంలో ఇంట్లో ఖాళీగా ఉంటోన్న సెలబ్రిటీలు రకరకాల ప్రయోగాలు చేస్తున్నారు. వీటిలో వంటకాలు కూడా ఒకటి.తాజాగా మంచువారబ్బాయి విష్ణు కూడా ఒక కొత్తరకం వంటకంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. తాజాగా మంచు విష్ణు కొబ్బరిబొండాంతో చేసిన వెరైటీ వంటకాన్ని తన ట్విట్టర్ ద్వారా షేర్ చేశాడు. తన తండ్రి మోహన్బాబుతో కలిసి ఈ వంటకాన్ని ఆయన తయారు చేశారు. ఇంతకీ మంచు విష్ణు చేసిన కొత్తరకం వంటకం ఏంటంటే.. కొబ్బరి బొండాంలో అన్నం, కోడికూర తయారీ. అంటే, కొబ్బరి బొండానికి తలకొట్టి, దానికి కన్నం పెట్టి.. దానిలో నుంచి రైస్ను లోపలికి కూరతారు. అలాగే, చికెన్ను కూడా కూరతారు. ఈ రెండు వంటకాలను వేర్వేరుగా చేశారు. ఇలా రైస్, చికెన్ కూరిన కొబ్బరి బొండాలను ఓవెన్లో పెట్టి వేడి చేస్తారు. ఈ వంటకాలను తయారుచేయడానికి మూడున్నర గంటల సమయం పట్టిందని వీడియోలో మోహన్బాబు అంటున్నారు. ఈ వంటకం తయారుచేయడానికి తన తండ్రితో కలిసి చాలా రోజులుగా ప్రయత్నిస్తున్నామని మంచు విష్ణు అన్నారు. విష్ణు కొబ్బరి బొండాలను ఓపెన్ చేసి రైస్, చికెన్ను బౌల్స్లో వేస్తుంటే ఆ కమ్మనైన వాసనను మంచు విష్ణు బాగా ఎంజాయ్ చేశారు. లాక్డౌన్ పూర్తయ్యే సరికి తానొక చెఫ్గా మారిపోతానని, తన దగ్గర బోలెడన్ని వంటకాలకు పేటెంట్ హక్కులు ఉంటాయని తన ట్వీట్లో మంచు విష్ణు పేర్కొన్నారు.
Well, trying to cook something new. Baked rice and chicken inside a coconut. By the time this lockdown is over, I will turn into a chef with lot of patents. #StayHome pic.twitter.com/RISRW6HgJ9
— Vishnu Manchu (@iVishnuManchu) April 15, 2020
ఎన్టీఆర్ వాస్తవ జీవిత చరిత్రను తీసే ధైర్యం బాలకృష్ణకు లేదు: లక్ష్మీపార్వతి