టాలీవుడ్ నటుడు మంచు విష్ణు సామాజిక అంశాలపై తనదైన కోణంలో స్పందిస్తున్నారు. ఈ క్రమంలోనే జన్మనిచ్చిన తల్లి, వీర జవానులు, రైతుల గొప్పతనం గురించి తెలుపుతూ తాజాగా ఆయన పోస్ట్ చేసిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో మంచు విష్ణు మాట్లాడుతూ.. ”ఈ రోజు నా మనసులో ఉన్న మాట మీతో చెప్పాలని మీ ముందుకొచ్చాను. ప్రపంచంలో నిత్యం మనము శిరస్సు వంచి నమస్కరించాల్సిన వాళ్ళు ముగ్గురు. బిడ్డకు జన్మనిచ్చిన తల్లి, మన ఆకలి తీర్చే రైతన్న, తన కుటుంబానికి దూరమై మన భద్రత కోసం కాపలా కాసే వీర జవాన్. ఈ ముగ్గురికీ లభించవలసిన గుర్తింపు లభించడం లేదని నా భావన. నా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆదర్శనీయమైన కన్న తల్లుల్ని, కష్ట జీవులైన రైతులను కలిసే అదృష్టం నాకు కలిగింది. కానీ వీర జవానులను కలిసే అదృష్టం కలగలేదు. అందుకే ఇప్పుడు భారత్ ఆర్మీ ఫోర్స్ గురించి తెలుసుకునే కొత్త ప్రయాణం మొదలుపెడుతున్నా. ప్రపంచంలో ఎంతో సమర్ధవంతమైన భారత్ ఆర్మీ ఫోర్స్లో అడుగుపెట్టి తమదైన ముద్ర వేసిన తెలుగు వీర జవానుల గురించి తెలుసుకోబోతున్నాను. మీలో ఎవరి దగ్గరైనా మన తెలుగు వీర జవానుల త్యాగాలకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు, పేర్లు ఉంటే నా ట్విటర్ ఖాతాకు పంపించాల్సిందిగా కోరుతున్నా. ప్రపంచంతో వాళ్ళ వీర కథలను పంచుకుందాం. జై జవాన్.. జై కిసాన్.. జై హింద్” అన్నారు. ఈ వీడియో చూసిన నెటిజన్స్ మంచువిష్ణు మనసుని మెచ్చుకుంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Something I’ve been wanting to share for a long time now – A journey to get to know the larger than life stories of our Telugu men and women in the armed forces whose courage and sacrifice makes my heart swell with pride!
Have something to share? Please share below. pic.twitter.com/lr7beAzcdA
— Vishnu Manchu (@iVishnuManchu) May 13, 2020
పవన్ రక్తం అంటూ నెటిజన్ కామెంట్… రేణూ దేశాయ్ ఘాటు స్పందన