ప్రస్తుతం చెన్నై నగర ప్రజలు తాగడానికి నీరు లేక అవస్థలు పడుతున్నారు. దేశంలోని ఆరవ పెద్ద నగరం చెన్నైలోని ప్రధాన జలాశయాలు అన్ని ఎండిపోవడంతో అక్కడి ప్రజలు దాహర్తితో అలమటిస్తున్నారు. తాజాగా మంచు మనోజ్ అక్కడి వారికి తన వంతు సాయం అందిస్తున్నాడు. మీరు కూడా సాయం అందించండి అని ట్విట్టర్ ద్వారా కోరాడు. “తెలుగు ప్రజలకి అవసరమైనప్పడు చెన్నై సాయం అందించింది. ఇప్పుడు మనం వారిని ఆదుకోవలసిన సమయం ఆసన్నమైందని” తన ట్వీట్లో తెలిపాడు. కొన్ని కంపెనీలు నీటి సమస్య వలన ఇంటి నుండే పని చేయాలని ఉద్యోగులకు సూచించాయి. హోటల్స్లో కూడా తక్కువ మోతాదులో నీటిని ఇస్తున్నారు. ఇటీవల రజనీకాంత్ అభిమాన సంఘమైన ‘రజనీ మక్కల్ మంద్రం’ చెన్నై ప్రజలకి ఉచితంగా నీటిని సరఫరా చేసింది. ట్యాంకర్ల ద్వారా చెన్నైలోని పలు ప్రాంతాలలోని ప్రజలకు నీరు సరఫరా చేసింది. ఈ నేపథ్యంలో చెన్నై నగర ప్రజలకి సాయం అందించేందుకు పలువురు సెలబ్రిటీలు ముందుకొస్తున్నారు. తమిళనాడు ముఖ్య మంత్రి పళని స్వామి కూడా నీటి సమస్యతో బాధపడుతున్న చెన్నై ప్రజలని ఆదుకునేందుకు కసరత్తులు చేస్తున్నారు. రైళ్ల ద్వారా చెన్నైకు తాగునీటిని తీసుకొచ్చేందుకు రూ.65 కోట్లు కేటాయించారు. ఇక మనోజ్ గతంలో హుదూద్ తుఫాను, వరదల సమయంలో వెంటనే స్పందించి తన వంతు సాయం అందించిన విషయం తెలిసిందే.
previous post
రష్మిక కొట్టినందుకు హ్యాపీ… “డియర్ కామ్రేడ్” విలన్