టాలీవుడ్ హీరో మంచు మనోజ్ తాజాగా ప్రజాశాంతి అధ్యక్షుడు కేఏ పాల్ గురించి చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. కేఏ పాల్ ఇటీవల ఓ మీడియా ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో రాజకీయాలకు సంబంధించి ఓ పాట పాడారు. ఆ వీడియో వైరల్ కావడంతో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తనదైన శైలిలో పాల్ పై స్పందించారు. నవ్వుతున్న ఎమోజీలను పెట్టి వీడియోను పోస్ట్ చేశారు. ఇది చూసిన మంచు మనోజ్ ”సార్ ఎపిక్ వీడియో. నేను ఆ పాటను ప్రాక్టీస్ చేస్తున్నాను కానీ ఆ ప్రపంచనేత (కేఏ పాల్) పాడినట్లుగా నేను పాడలేకపోతున్నాను” అంటూ ట్వీట్ చేశారు. మనోజ్ చేసిన ఈ ట్వీట్ పై నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ఇక కేఏ పాల్ ఏపీలోని అన్ని నియోజకవర్గాల్లో తమ పార్టీ తరఫున అభ్యర్ధులను నిలబెడుతున్నాడు. తమ పార్టీ కచ్చితంగా విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
Sirrrrr …. epic videoooo 😂 I’m practising it sir but not able to get it right like the World Leader 🙏🏻 https://t.co/8whNG8D0as
— Manoj Kumar Manchu❤️ (@HeroManoj1) January 23, 2019