telugu navyamedia
సినిమా వార్తలు

“స్కేర్డ్ పీపుల్” అంటున్న మంచు లక్ష్మీ.. ఎవరినో తెలుసా ?

manchu lakshmi

ప్రముఖ తెలుగు సినీ నటుడు మోహన్ బాబును పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. శ్రీవిద్యానికేతన్ విద్యాసంస్థల సమస్యలపై ఆయన శుక్రవారం ర్యాలీని తలపెట్టారు. దీంతో ముందస్తుగా ఆయనను హౌస్ అరెస్టు చేశారు. ఫీజు రీయింబర్స్మెంట్ ను ప్రభుత్వం విడుదల చేయకపోవడాన్ని నిరసిస్తూ శుక్రవారం శ్రీవిద్యా నికేతన్ నుంచి తిరుపతి వరకు వేలాది మంది విద్యార్థులతో మోహన్ బాబు నిరసన ర్యాలీ చేపడతానని వెల్లడించగా, ఆయన నిర్వహించే ర్యాలీకి పోలీసులు అనుమతి ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో తాను ర్యాలీని చేపట్టి తీరుతానని మోహన్ బాబు వెల్లడించారు. దీంతో ఆయనను పోలీసులు హౌస్ అరెస్టు చేసి, ఆయన ఇంటిని చుట్టుముట్టారు.

ఈ ఉదయం తిరుపతిలో తాను శాంతియుతంగా ర్యాలీ నిర్వహించాలని నిర్ణయించుకున్నానని, కానీ తన ఇంటి ముందు ఉన్న పోలీసులు బయటకు వెళ్లేందుకు అంగీకరించబోరేమోనని మోహన్ బాబు చేసిన ట్వీట్ పై ఆయన కుమార్తె, నటి మంచు లక్ష్మి స్పందించారు. “స్కేర్డ్ పీపుల్” అంటూ ట్వీట్ చేశారు. మోహన్ బాబును చూసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భయపడుతోందన్న అర్థం వచ్చేలా మంచు లక్ష్మి ట్వీట్ చేసింది. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ గా మారింది. పలువురు నెటిజన్లు మంచు కుటుంబానికి అండగా ఉంటామని కామెంట్స్ చేస్తున్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ ను విడుదల చేయకపోవడంపై గతంలో మోహన్ బాబు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పై ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.

Related posts