telugu navyamedia
సినిమా వార్తలు

మోహన్ బాబు కూతురని కూడా చూడకుండా… : మంచు లక్ష్మీ 

manchu lakshmi
టాలీవుడ్ ఇండస్ట్రీలో చిన్న సినిమాలకు థియేటర్ల సమస్య ఎప్పటి నుంచో ఉంది. నలుగురు సినిమా పెద్దల చేతుల్లోనే థియేటర్లు ఉన్నాయని, చిన్న సినిమాలకు వారు థియేటర్లు ఇవ్వరని, తమకు థియేటర్లు దొరకడం లేదని ఎంతోమంది చిన్న సినిమాల నిర్మాతలు, దర్శకులు, నటీనటులు బహిరంగంగానే ఆవేదన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. కొంతమంది మాత్రం ధైర్యం చేసి ఇండస్ట్రీలో థియేటర్ మాఫియా పెరిగిపోయిందని ఆ నలుగురిపై ఫైర్ అయ్యారు. తాజాగా నటి మంచులక్ష్మీ కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేయడం గమనార్హం. 
ప్రముఖ హీరో మోహన్ బాబు కూతురిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన మంచు లక్ష్మీ హీరోయిన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూనే పలు బుల్లితెర షోలలో కూడా కన్పించింది. తాజాగా మంచులక్ష్మీ “మిసెస్ సుబ్బలక్ష్మీ” అనే వెబ్ సిరీస్ లో నటిస్తోంది. ఈ వెబ్ సిరీస్ విడుదల సందర్భంగా మీడియాతో మాట్లాడారు మంచులక్ష్మీ. ఇండస్ట్రీలో థియేటర్లన్నీ ఐదారుగురు చేతుల్లోనే ఉన్నాయని, వాళ్ళను అడిగేవారే లేరని, కష్టపడి సినిమా తీస్తే… కనీసం వారం కూడా ఆడకుండానే దాన్ని థియేటర్ల నుంచి పీకేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. మోహన్ బాబు కూతురని కూడా ఆలోచించరని, అటువంటి మొహమాటాలు వాళ్లకు అస్సలు ఉండవని, తాను నటించిన ఎన్నో మంచి సినిమాలను అకారణంగా థియేటర్ల నుంచి తొలగించారని కామెంట్స్ చేశారు.

Related posts