telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు సామాజిక

మంచిర్యాల జిల్లాలో తొలి కరోనా కేసు నమోదు

Corona

తెలంగాణ రాష్ట్రంలోని మంచిర్యాల జిల్లాలో తొలి కరోనా కేసు నమోదు కావడంతో జిల్లా అధికారులు హై అలర్ట్‌ ప్రకటించారు. చెన్నూరు మండలం ముత్తరావుపల్లి గ్రామానికి చెందిన 46సం మహిళ కు తీవ్ర జ్వరం రావడంతో మంగళవారం ఆమెను హైదరాబాద్‌కు తరలించారు. ఈనెల 14వ తేదీన ఆమె హైదరాబాద్‌లోనే చనిపోయింది.

అప్పటికే పంపిన శాంపిల్స్‌లో ఆమెకు పాజిటివ్‌ అని తేలడంతో ముత్తరావుపల్లిలో అధికారులు హైఅలర్ట్‌ ప్రకటించారు. మృతి చెందిన మహిళ కుటుంబ సభ్యులు. మరియు ఆమె ఎంతమందిని  సెకండరీ కాంటాక్ట్ ద్వారా కలిసింది అనే వివరాల సేకరణ కోసం  పోలీసులు, వైద్య సిబ్బంది గ్రామానికి బయలుదేరీ వెళ్లారు.

Related posts