ఆరోగ్యం కోసం, వైద్యుడి సలహా మేరకు పలానా ఆహారమే తీసుకుంటుంటారు కొందరు. ఇది సాధారణంగా జరిగే తంతు. కానీ కొందరికి పబ్లిసిటీ పిచ్చి ఏరకంగా ఉంటుందంటే, దానికోసం ఏదైనా చేసేస్తారు. అప్పటి వరకు ప్రజలలో ఉండి, హఠాత్తుగా ఒంటరిగా బ్రతకాల్సి వస్తే వాళ్ళు చేసే పిచ్చ పనులు ఎలా ఉంటాయో మీరు చదివి తెలుసుకోండి. ఆయన ఒక ఆర్మీ అధికారి. రిటైర్ అయ్యాడు, అంతకు ముందు వరకు ప్రజలకు సేవచేస్తూ బాగానే ఉన్నాడు.. కానీ రిటైర్ అయిన తరువాత తానొక్కడే ఆయిపోయాడనిపించిందేమో.. అప్పటి నుండి ఇదిగో ఇలా .. కేవలం బీర్, నీళ్లు మాత్రమే పుచ్చుకోవడం లాంటి పనులు చేస్తున్నాడు; పైగా వాటిని ఈ మనిషి సోషల్ మీడియాలో పెట్టాడు.. అది ఇప్పుడు వైరల్గా మారింది.
వివరాలను పరిశీలిస్తే, ఓహియోకు చెందిన డెల్హల్ అనే వ్యక్తి ఆర్మీ అధికారిగా పనిచేసారు. రిటైర్ అయిన తర్వాత ప్రజల్లో ప్రత్యేకంగా గుర్తింపు పొందాలని ఆశించారు. అయితే అందుకోసం ఏం చేయాలో అతడికి తెలియకపోవడంతో… ఓ రోజు ఎటువంటి ఘనపదార్థాలు తీసుకోకుండా కేవలం బీర్, నీళ్లు మాత్రమే తాగాడు. అలా నాలుగు రోజులు బీర్లు, నీళ్లు మాత్రమే అతడి ఆహారంగా మారింది. అలా నాలుగు రోజులు కాస్త 46 రోజులు అయ్యాయి. అన్ని రోజులు గడిచినా కూడా డెల్ కేవలం బీర్, నీళ్లు మాత్రమే తాగి బతుకేస్తున్నాడు. సోషల్ మీడియాలో డెల్ చేసే పని గురించి పోస్ట్ పెట్టాడు. చాలా మంది నెటిజన్లకు డెల్ చేస్తున్న పని పట్ల ఆసక్తి కలిగింది. కొంతమంది డెల్ను నమ్మని వ్యక్తులు అతడి వద్దకు వచ్చి మరీ వివరాలు అడిగి తెలుసుకున్నారు. డెల్ కేవలం బీర్, నీళ్లు మాత్రమే తాగుతున్నాడని వాళ్లు నిర్ధారించుకున్నారు కూడా.
అలా హరీష్ శంకర్ హిట్ కొడితే ఇండస్ట్రీ వదిలేస్తా… బండ్ల గణేష్ ఫైర్