telugu navyamedia
క్రైమ్ వార్తలు

హైద‌రాబాద్‌లో నిండు గ‌ర్భిణి దారుణ హ‌త్య‌..

*హైద‌రాబాద్‌లో నిండు గ‌ర్భిణి దారుణ హ‌త్య‌
*బావమరిది అయ్యే వెంకట రామక్రిష్ణను అంతం చేయాలని ప్లాన్‌
*ఆ స‌మ‌యంలో ఇంట్లో రామ‌కృష్ణ లేక‌పోవ‌డంతో భార్య స్ర‌వంతిపై దాడి

హైదరాబాదులోని గచ్చిబౌలి పరిధిలో దారుణం చోటు చేసుకుంది. నిండు గర్భిణీ అని చూడకుండా ఓ వ్యక్తి వేట కొడవలితో ఆమెను దారుణంగా హతమార్చాడు.

వివ‌రాల్లోకి వెళితే..

తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంకి చెందిన వి. వెంకట రామకృష్ణ తన భార్య వాసంశెట్టి స్రవంతి (32)తో కలిసి కొంతకాలం హైదరాబాద్ కొండాపూర్ లోని జేవీజీ హిల్స్ డీఆర్ టవర్స్ లో నివాసం ఉంటున్నారు. . రామక్రిష్ణ హైద‌రాబాద్‌లో సాప్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. వీరికి పదేళ్ల కూతురు చైత్ర ఉంది.ప్రస్తుతం స్రవంతి 8 నెలల గర్భిణీ.

వెంకటరామక్రిష్ణ పిన్ని కూతురు లక్ష్మీ ప్రసన్న కూడా సాఫ్ట్ వేర్ ఇంజినీరుగా పని చేస్తుంది. ఆమెకు రెండేళ్ల క్రితం పశ్చిమగోదావరి జిల్లా పేరుపాలెం గ్రామానికి చెందిన కావూరు శ్రీరామక్రిష్ణతో పెళ్లి జరిగింది. ఈ పెళ్లికి వెంకటరామక్రిష్ణ మధ్యవర్తిత్వం వహించాడు.

అయితే, కొత్తగా పెళ్లైన కొంతకాలం తర్వాత అదనపు కట్నం కోసం తన భార్య లక్ష్మీ ప్రసన్నను వేధించడం ప్రారంభించడంతో.. లక్ష్మీప్రసన్న తన పుట్టింటి వాళ్లకు ఈ విషయం చెప్పింది. దీంతో వెంకట రామకృష్ణ చెల్లెలికాపురం సరిదిద్దే ప్రయత్నం చేసినా.. శ్రీరామకృష్ణ వినలేదు. ఇదే విషయంగా నిరుడు పేరుపాలెంలో పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టారు.. దీంతో అప్పటి నుంచి శ్రీరామక్రిష్ణ, వెంకట రామక్రిష్ణపై కోపం పంచుకున్నాడు .

పంచాయితీ తర్వాత కూడా పరిస్థితి మారకపోవడంతో లక్ష్మీ ప్రసన్న భర్త శ్రీరామక్రిష్ణ నుంచి వేరుగా ఉంటూ సాఫ్ట్ వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తోంది.

భర్త నుంచి వేధింపులు వస్తున్నాయని నెల క్రితం భర్త, అత్తింటి వారిపై ఆమె చందానగర్ లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని శ్రీ రామకృష్ణకు నోటీసులు జారీ చేశారు.

దీనంతటికీ వెనక రామకృష్ణ దంపతులే ఉన్నారని వారి పేరు శ్రీ రామకృష్ణ కక్ష పెంచుకున్నాడు.బావమరిది అయ్యే వెంకట రామక్రిష్ణను అంతం చేయాలని శ్రీరామక్రిష్ణ అనుకున్నాడు.

ఈ క్రమంలోనే ఎర్రగడ్డలో వేట కొడవలి కొని.. ఈ నెల 6న కొండాపూర్లో బావమరిది ఇంటికి వెళ్ళాడు. ఆ సమయంలో వెంకట రామకృష్ణ తన కుమార్తెను స్కూల్ నుంచి తీసుకు వచ్చేందుకు బయటికి వెళ్లాడు.

ఇంట్లో ఒంటరిగా ఉన్న స్రవంతి శ్రీరామకృష్ణ చేతిలో వేట కొడవలి చూసి కేకలు వేస్తూ.. బయటికి వెళ్లేందుకు ప్రయత్నించింది. కానీ, శ్రీ రామకృష్ణ, నిండు గర్భిణి అని కూడా చూడకుండా ఆమె తల వెనుక భాగం, భుజం మీద దాడి చేసి అక్కడి నుంచి పారిపోయాడు. రక్తపు మడుగులో పడివున్న బాధితురాలి కేకలు విని పక్కింటి వారు వచ్చి ఆమెను ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లగా అక్కడ చికిత్స పొందుతూ అదే రోజు రాత్రి చనిపోయింది.

విష‌యం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సిసిటివి ఫుటేజీ ఆధారంగా నిందితుడిని గుర్తించి.. అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించారు.

Related posts