తెలంగాణ రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. జిల్లాలోని చర్లమండలం రేగుంటలో నెల రోజుల పసికందు తండ్రి చేతిలోనే హతమైంది. చర్ల మండలం రేగుంటకు చెందిన సూర్యతేజ మొదటి సంతానంగా కూతురు పుట్టింది. రెండో సారి కూడా అమ్మాయి పుట్టడాన్ని సూర్యతేజ జీర్ణించుకోలేకపోయాడు.
దీంతో నెల రోజుల పసికందును నీళ్ల తొట్టెలో పడేసి హతమార్చాడు. మంగళవారం ఉదయం నిద్రలేచిన అఖిల మంచంపై పసిపాప కనిపించకపోవడంతో తన తల్లికి చెప్పింది. దీంతో ఇద్దరూ కలిసి పాప కోసం గాలించగా ఇంటి ఆవరణలో ఉన్న తొట్టెలో తేలి ఉన్న పాపను గమనించారు. పాపను నీటి తొట్టిలో వేసిన సూర్యతేజను గ్రామస్థులు చితకబాదారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.